HomeతెలంగాణCP Sai Chaitanya | తాగి నడిపితే జైలుకే.. జిల్లాలో భారీగా పెరిగిన డ్రంక్​ అండ్​...

CP Sai Chaitanya | తాగి నడిపితే జైలుకే.. జిల్లాలో భారీగా పెరిగిన డ్రంక్​ అండ్​ క్రైమ్​ కేసులు.. సీపీ

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | జిల్లాలో వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లో సీపీ ఉపేక్షించడం లేదు. నిజామాబాద్​ కమిషనరేట్(Nizamabad Commissionerate)​ పరిధిలో నిత్యం ఏదో ఒక చోట తనిఖీలు చేస్తున్నారు. తాగి కార్లు, బైక్​లు, భారీ వాహనాలు నడుపుతున్నట్లు రుజువైతే వారిపై పక్కాగా కేసులు నమోదు చేస్తున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరుస్తున్నారు.

CP Sai Chaitanya | జిల్లాలో ఒక్కనెలలోనే 1,708 కేసులు నమోదు..

జిల్లాలో గత జూలైలో ఏకంగా 17,08 కేసులు నమోదు చేసినట్లు సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. అందులో 966 కేసుల్లో నేరం రుజువైనందుకు 77మందిని న్యాయస్థానం జైలుకు పంపింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని అన్ని పోలీస్​స్టేషన్ల పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా ట్రాఫిక్​ పోలీసులు(Traffic Police) తనిఖీలు చేస్తూ కేసు నమోదు చేస్తున్నారు. అలాగే ప్రతి ట్రాఫిక్​ సిగ్నల్స్​ వద్ద పోలీసులు తనిఖీ చేస్తూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

CP Sai Chaitanya | ఆర్టీఏ ఆధ్వర్యంలో..

కమిషనరేట్​ పరిధిలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ వాహనాలపై ఆర్టీఏ అధికారులు(RTA Officers) కూడా చర్యలు చేపట్టారు. పోలీసులు కేసులు నమోదు చేసిన అనంతరం ఆర్టీఏ అధికారులు జూలైలో మొత్తం 62 డ్రైవింగ్​ లైసెన్స్(Driving License)​లను సస్పెండ్​ చేశారు.

Must Read
Related News