ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaithanya | గణేశ్​ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీపీ

    CP Sai Chaithanya | గణేశ్​ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీపీ

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaithanya | గణేశ్​ నిమజ్జనం (Ganesh immersion) సందర్భంగా నిర్వహిస్తున్న ప్రదేశాలను సీపీ సాయిచైతన్య పర్యవేక్షించారు. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి స్వయంగా కొద్దిదూరం బైక్ నడుపుతూ వినాయక నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు.

    బాసర (basara), ఉమ్మడి బ్రిడ్జి, బోధన్ (Bodhan), బోర్గాం తదితర ప్రదేశాలను సీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేందుకు పోలీస్​శాఖ విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేసిందని స్పష్టం చేశారు.

    CP Sai Chaithanya | కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం..

    నిమజ్జక కార్యక్రమం శాంతియుతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు సీపీ సాయిచైతన్య వివరించారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతాపరంగా అన్ని అవసరమైన చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

    ప్రజలందరూ పోలీసులకు సహకారాన్ని అందించాలని, ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో 100 డయల్ నంబర్‌కు కాల్​ చేయాలని సూచించారు. నిమజ్జన వేడుకను సురక్షితంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని తెలిపారు. సీపీ వెంట ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు మరియు బందోబస్తు సిబ్బంది ఉన్నారు.

    More like this

    CM Revanth Reddy | పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్​రెడ్డి భేటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి బీఆర్​ఎస్​ (BRS) నుంచి కాంగ్రెస్​లో చేరిన...

    Shabbir Ali | షబ్బీర్ అలీ కారుకు ప్రమాదం

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో (Government Degree College) బీసీ సభ...

    Nizamabad City | పౌర్ణమిని సందర్భంగా నగరంలో శ్రీప్రభు పల్లకీ సేవ

    అక్షరటుడే,ఇందూరు: Nizamabad City | నగరంలోని వినాయక్​నగర్​లోని వినాయక కళ్యాణ మండపంలో (Vinayaka Kalyana Mandapam) ఓమౌజయ ఏకోపాసన...