Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad CP | దేవిరోడ్​ వన్​వేను కాలినడకన పరిశీలించిన సీపీ

Nizamabad CP | దేవిరోడ్​ వన్​వేను కాలినడకన పరిశీలించిన సీపీ

ట్రాఫిక్​ ఇబ్బందులను పరిష్కరించేందుకు గతంలో దేవిరోడ్​ను వన్​వే చేశారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య గురువారం వన్​వే అమలు చేస్తున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad CP | నగరంలో ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించేందుకు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్​ ఇబ్బందులను (traffic problems) తీర్చాలని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మూడునెలల క్రితం ఖలీల్​వాడీ, దేవిరోడ్​లను వన్​వే చేశారు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.

Nizamabad CP | క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ..

ఈ సందర్భంగా దేవిరోడ్​లో (Devi Road) రాకపోకలను సీపీ సాయిచైతన్య గురువారం రాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలినడకన గంజ్​ నుంచి దేవిరోడ్డు చివరి వరకు కాలినడకన పర్యటించారు. అలాగే ప్రజలతో మాట్లాడారు. వన్​వే కారణంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయా.. ప్రయోజనం ఉందా అని వివరాలు సేకరించారు.

Nizamabad CP | దేవిమాత ఆలయ భక్తుల పార్కింగ్​..

దేవిరోడ్డులో వస్తువులు కొనడానికి వచ్చే వారితో సైతం సీపీ మాట్లాడారు. అలాగే ఆ రోడ్డులో ఉన్న దేవిమాత ఆలయానికి (Devi Mata temple) వచ్చే భక్తులు తమ వాహనాలు ఎక్కడ పార్కింగ్​ చేస్తున్నారని ట్రాఫిక్​ సిబ్బందిని అడిగారు. అలాగే సెల్లార్లలో వ్యాపారాల నిర్వహణపై ఆరా తీశారు. సీపీ వెంట ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ (Traffic ACP Mastan Ali), ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News