అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్ (Ergatla SI Rajeshwar) షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగించేలా అవగాహన కల్పిస్తూ ఆయన లఘు చిత్రం తీశారు.
షార్ట్ఫిల్మ్ను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ వాడకం తప్పనిసరి అని షార్ట్ ఫిలిం తీసిన ఎస్సైని ఆయన అభినందించారు.
