Nizamabad city
Nizamabad city | నగరంలో దంపతుల ఆత్మహత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nizamabad city | నిజామాబాద్ నగరంలో దంపతుల సూసైడ్ కలకలం రేపింది. దంపతులిద్దరూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. గాయత్రి నగర్​లో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. మృతులు బొలిశెట్టి శ్రీనివాస్​(53), బొలిశెట్టి మమత(48)గా పోలీసులు గుర్తించారు. తాము నివాసం ఉండే ఇంట్లోనే వేరు బలవన్మరణం చేసుకున్నారు. నగర సీఐ శ్రీనివాస్​ రాజ్​, నాలుగో టౌన్ ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కాగా.. అప్పుల బాధతో సూసైడ్​కు పాల్పడి ఉంటారని సమాచారం. అన్ని కోణాల్లో విచారణ జరిపాక వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.