- Advertisement -
Homeతెలంగాణcoronavirus | రాష్ట్రంలో కరోనా కలకలం.. అప్రమత్తమైన ప్రభుత్వం

coronavirus | రాష్ట్రంలో కరోనా కలకలం.. అప్రమత్తమైన ప్రభుత్వం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : coronavirus | రాష్ట్రంలో కరోనా కేసులు (corona cases) నమోదు అవుతుండటంతో ఆందోళన నెలకొంది. నాలుగు కోవిడ్​ పాజిటివ్​ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హెల్త్​ డైరెక్టర్ (Health Director)​ రవీందర్​ తెలిపారు.

రాష్ట్రస్థాయితో పాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్​ రూమ్​లు (control rooms) ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. వైరస్​ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటిస్తే చాలు అని సూచించారు. ప్రస్తుతం కరోనా తీవ్ర (భయంకర) దశలో లేదని, ఎండమిక్​(చివరి) దశలో ఉందని వివరించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News