అక్షరటుడే, బోధన్: Bodhan | బోధన్ మండలంలోని (Bodhan mandal) సంగం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో (District Collector office) ప్రజావాణి ద్వారా జాయింట్ కలెక్టర్కు రాజీనామా పత్రాలను అందించారు. సొసైటీలో అనేక ఇబ్బందులు ఉన్నాయని సంఘం అధ్యక్షుడు ముత్తరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని వివరించారు. దీంతో తనతో పాటు పది మంది సొసైటీ డైరెక్టర్లు రాజీనామా పత్రాలను సమర్పించామని చెప్పారు.
