అక్షరటుడే, హైదరాబాద్: Cooking oil prices | దేశంలో వంటనూనెల ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే కారణం. క్రూడ్ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 10 శాతం తగ్గించాలని నిర్ణయించింది.
తాజా తగ్గింపు నిర్ణయం మే 31 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం క్రూడ్ సోయా ఆయిల్, క్రూడ్ పామాయిల్, క్రూడ్ సన్ఫ్లవర్పై 20 శాతం దిగుమతి సుంకం కొనసాగుతోంది.
Cooking oil prices | ఈ దేశాల నుంచి దిగుమతి..
దేశీయంగా వినియోగించే వంటనూనెల్లో 70 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మలేషియా, ఇండోనేషియా, థాయ్లాండ్ నుంచి పామాయిల్ దిగుమతి అవుతోంది. బ్రెజిల్, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం.
ప్రస్తుతం ఈ వంట నూనెలపై దిగుమతి సుంకం 27.5 శాతం ఉంది. పది శాతం తగ్గితే.. 16.5 శాతానికి పరిమితం కానుంది. కాగా, క్రూడ్, రిఫైన్ వంటనూనెలపై సెప్టెంబరు 2024లో కస్టమ్స్ సుంకాన్ని 20 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది.
