Homeతాజావార్తలుSupreme Court | స్పీకర్​పై కోర్టు ధిక్కార పిటిషన్​.. ఎందుకో తెలుసా?

Supreme Court | స్పీకర్​పై కోర్టు ధిక్కార పిటిషన్​.. ఎందుకో తెలుసా?

అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​పై బీఆర్​ఎస్​ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్​ వేసింది. న్యాయస్థానం ఆదేశాలు పాటించని స్పీకర్​పై చర్యలు చేపట్టాలని కోరింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్​పై (Speaker Gaddam Prasad Kumar) బీఆర్​ఎస్​ కోర్టు ధిక్కార పిటిషన్​ దాఖలు చేసింది. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ఆదేశాలను ఆయన పట్టించుకోలేదని సుప్రీంకోర్టులో ఆ పార్టీ పిటిషన్ వేసింది.

రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక.. 10 మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ నేతలు స్పీకర్​కు ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించకపోవడంతో సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. ఈ మేరకు సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం మూడు నెలల్లో అనర్హతన పిటిషన్లపై విచారణ తీసుకోవాలని జులై 31న తీర్పు చెప్పింది.

Supreme Court | బీఆర్​ఎస్​ పిటిషిన్​

సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు అక్టోబర్​ 31తో ముగిసింది. అయినా అనర్హత పిటిషన్లపై స్పీకర్​ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో బీఆర్​ఎస్ ఆయనపై కోర్టు ధిక్కార పిటిషన్‌ (contempt of court petition) దాఖలు చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నా చర్యలు తీసుకోలేదని పిటిషన్​లో పేర్కొంది. ఈ పిటిషన్​ను వచ్చే సోమవారం విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి ధర్మాసనం తెలిపింది.

Supreme Court | కొనసాగుతున్న ఎమ్మెల్యేల విచారణ

సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్పీకర్​ ప్రసాద్​ కుమార్​ ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారించారు. నలుగురు ఎమ్మెల్యేల స్టేట్​మెంట్​ను ఆయన గతంలో నమోదు చేశారు. మరో నలుగురి ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియ సాగుతోంది. అయితే విచారణ పూర్తికాకపోవడంతో మరింత గడువు కావాలని ఇప్పటికే సుప్రీంలో స్పీకర్‌ కార్యాలయం పిటిషన్‌ వేసింది. ఆ పిటిషన్​ విచారణకు రాకముందే బీఆర్​ఎస్​ కోర్టు (BRS court) ధిక్కార పిటిషన్​ ఫైల్​ చేయడం గమనార్హం.

Must Read
Related News