HomeతెలంగాణRailway Track | బెల్లంపల్లి–తాండూరు మార్గంలో మూడో రైల్వే లైన్​ నిర్మాణం పూర్తి

Railway Track | బెల్లంపల్లి–తాండూరు మార్గంలో మూడో రైల్వే లైన్​ నిర్మాణం పూర్తి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Railway Track | బెల్లంపల్లి నుంచి రేచినీ రోడ్డు (తాండూరు) మధ్య 10 కిలోమీటర్ల మేర మూడో రైల్వే లైన్​ నిర్మాణం పూర్తయింది. బెల్లంపల్లి నుంచి మందమర్రి, మాణిక్​ఘడ్ నుంచి బల్లార్షా (Ballarsha) మధ్య 20 కిలోమీటర్లు పూర్తయితే కాజీపేట నుంచి బల్లార్షా సెక్షన్ మొత్తం మూడో మార్గం అందుబాటులోకి వస్తుంది.

ఉత్తర, దక్షిణ భారత (North and South India) దేశాలను కలిపే కీలక మార్గం కాజీపేట –బల్లార్షా. ఈ మార్గంలో నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఇక్కడ ఇప్పటికే రెండు రైల్వే ట్రాక్​లు ఉన్నాయి. అయితే రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని మూడో లైన్​ నిర్మాణం చేపట్టారు.

Railway Track | 235 కిలోమీటర్ల మేర..

కాజీపేట నుంచి బల్లార్షా (Kazipet to Ballarsha) సెక్షన్ మొత్తం దూరం 235 కిలోమీటర్లు. ఈ మార్గంలో మూడో రైల్వే లైన్​ పనులను 2016లో ప్రారంభించారు. ఇప్పటికే పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ సెక్షన్​లో మిగిలిన 20 కిలోమీటర్లు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అధికారుకు ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఈ సెక్షన్ మొత్తం మూడో మార్గం అందుబాటులోకి వస్తుంది.

Railway Track | త్వరలో నాలుగో లైన్​

కాజీపేట–బల్లార్షా మార్గంలో మూడో లైన్​ పూర్తయిన తర్వాత నాలుగో లైన్​ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. ఇటీవలే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnav) కాజీపేట జంక్షన్ సమీపంలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ పరిశ్రమ తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆయన నాలుగో లైన్​ నిర్మాణం గురించి అధికారులతో చర్చించారు. ఈ మేరకు వచ్చే బడ్జెట్​లో నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఇప్పటికే అధికారులు నాలుగో లైన్​ నిర్మాణం కోసం సర్వే కూడా చేస్తున్నారు. అనంతరం డీపీఆర్​ తయారు చేసి ఉన్నతాధికారులకు పంపనున్నారు.

Must Read
Related News