ePaper
More
    HomeజాతీయంWaqf Act 2025 | రాజ్యాంగబద్ధమైన చ‌ట్టాల్లో జోక్యం చేసుకోలేం.. వ‌క్ఫ్ చ‌ట్టంపై విచార‌ణ సంద‌ర్భంగా...

    Waqf Act 2025 | రాజ్యాంగబద్ధమైన చ‌ట్టాల్లో జోక్యం చేసుకోలేం.. వ‌క్ఫ్ చ‌ట్టంపై విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీం వ్యాఖ్య‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Waqf Act | పార్లమెంటు ఆమోదించిన చట్టాలు రాజ్యాంగబద్ధమైనవని సుప్రీంకోర్టు (suprem court) మంగళవారం స్ప‌ష్టం చేసింది. ఆయా చ‌ట్టాల్లో తీవ్రమైన సమస్య ఉంటే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్​(BR Gavai) వ్యాఖ్యానించారు. వక్ఫ్ సవరణ చట్టానికి (Waqf Amendment Act) వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. గత నెలలో పార్ల‌మెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్​(BR Gavai), న్యాయమూర్తి ఏజీ మసీహ్‌లతో (Justice AG Masih) కూడిన ధర్మాసనం మంగ‌ళ‌వారం మ‌రోమారు విచారించింది. ఈ సంద‌ర్భంగానే సీజే పై వ్యాఖ్య‌లు చేశారు.

    Waqf Act 2025 | మూడింటికే ప‌రిమితం కావాల‌న్న కేంద్రం..

    వక్ఫ్ బై యూజ‌ర్‌, వక్ఫ్ కౌన్సిల్ (Waqf Council), రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు (State Waqf Boards) ముస్లింలు కాని వారి నామినేట్ చేయ‌డం, ప్రభుత్వ భూమిని వక్ఫ్ ఆస్తిగా గుర్తించడం వంటి మూడు కీలక అంశాలను సుప్రీంకోర్టు గతంలో గుర్తించింది. కేసు పరిష్కారమ‌య్యే వరకు ఈ మూడింటిపై ముందుకు సాగబోమని కేంద్రం గ‌తంలో హామీ ఇచ్చింది. తాజా విచార‌ణ సంద‌ర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Solicitor General Tushar Mehta) మాట్లాడుతూ.. మూడు అంశాలపై కేంద్రం తన ప్రతిస్పందనను సమర్పించిందని గుర్తు చేశారు. “పిటిషనర్ల రాపూర్వక సమర్పణలు ఇప్పుడు అనేక ఇతర అంశాలకు విస్తరించాయి. దానిని మూడు అంశాలకు మాత్రమే పరిమితం చేయాలనేది మా అభ్యర్థన” అని ఆయన కోర్టుకు విన్న‌వించారు.

    Waqf Act 2025 | వ్య‌తిరేకించిన పిటిష‌న‌ర్లు..

    అయితే, కేంద్రం అభ్య‌ర్థ‌న‌ను పిటిష‌న‌ర్ల త‌ర‌ఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్(Kapil Sibal), అభిషేక్ మను సింఘ్వి(Abhishek Manu Singhvi) వ్యతిరేకించారు. “మేము కేసును విచారిస్తామని, మధ్యంతర ఉపశమనం ఏమి ఇవ్వాలో చూస్తామని అప్పటి CJI సంజీవ్ ఖన్నా(Sanjeev Khanna) చెప్పారు. ఇప్పుడు మేము మూడు అంశాలకే పరిమితం అని చెప్పలేము,” అని సింఘ్వీ అన్నారు. “విడత‌ల వారీగా విచారణ” ఉండదని ఆయ‌న పేర్కొన్నారు. వక్ఫ్ భూములను (waqf lands) నియంత్రించడానికి ఈ చట్టం ఉద్దేశించబడిందని సిబల్ వాదించారు. “వక్ఫ్ ఆస్తిని ఎటువంటి ప్రక్రియను అనుసరించకుండానే లాక్ చేసుకునే విధంగా చట్టం రూపొందించారని” అని అన్నారు. కనీసం ఐదు సంవత్సరాలు ఇస్లాంను ఆచరించిన వ్యక్తి మాత్రమే వక్ఫ్‌ను సృష్టించగలడనే నిబంధ‌న‌ను ఆయ‌న కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. “నేను మరణశయ్యపై ఉన్నప్పుడు వక్ఫ్ చేయాలనుకుంటే, నేను ముస్లింను అని నిరూపించుకోవాలి. ఇది రాజ్యాంగ విరుద్ధం,” అని కపిల్ సిబల్ తెలిపారు.

    Waqf Act 2025 | అన్నింట్లోనూ జోక్యం చేసుకోజాలం..

    ఇరువురి వాద‌న‌లు విన్న‌ ప్రధాన న్యాయమూర్తి గవాయ్(Justice Gavai) స్పందిస్తూ.. “పార్లమెంట్ ఆమోదించిన చట్టంలో రాజ్యాంగబద్ధత అంచనా ఉంది. ఒక స్పష్టమైన కేసు రూపొందించకపోతే త‌ప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవు, ముఖ్యంగా ప్రస్తుత దృష్టాంతంలో మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు” అని వ్యాఖ్యానించారు.

    More like this

    TVS NTORQ 150 లాంచింగ్​.. ఫస్ట్​ హైపర్ స్పోర్ట్ స్కూటర్.. ప్రత్యేకతలు ఇవే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: భారత్​లో అత్యంత వేగవంతమైన, మొట్టమొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్ TVS NTORQ 150 ని టీవీఎస్...

    BJP Yellareddy | నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గించడం భేష్​.. బీజేపీ నాయకులు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : BJP Yellareddy | కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల వస్తువులపై జీఎస్టీని తగ్గించడంపై బీజేపీ...

    GPO | కొత్త జీపీఓలకు కౌన్సెలింగ్

    అక్షరటుడే, ఇందూరు: GPO | రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రామపంచాయతీ అధికారుల (Gram Panchayat Officers) నియామకాలు చేపట్టింది....