Homeజిల్లాలునిజామాబాద్​Constable Murder Case | కానిస్టేబుల్​ హత్య కేసు నిందితుడిని పట్టుకుంటాం: ఐజీ

Constable Murder Case | కానిస్టేబుల్​ హత్య కేసు నిందితుడిని పట్టుకుంటాం: ఐజీ

కానిస్టేబుల్​ ప్రమోద్​ను హత్యచేసిన నిందితుడు రియాజ్​ను త్వరలోనే పట్టుకుంటామని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలో ప్రమోద్​ అంత్యక్రియలకు ఆయన హాజరయ్యారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Constable Murder Case | నగరంలో సీసీఎస్​ కానిస్టేబుల్​ ప్రమోద్​ను (CCS constable Pramod) హత్య చేసిన నిందితుడు రియజ్​ను త్వరలోనే పట్టుకుంటామని ఐజీ చంద్రశేఖర్​రెడ్డి (IG Chandrasekhar Reddy) పేర్కొన్నారు. నగరంలో శనివారం అధికార లాంఛనాలతో నిర్వహించిన ప్రమోద్ అంత్యక్రియలకు ఐజీ హాజరయ్యారు. ప్రమోద్​ పార్థీవదేహానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Constable Murder Case | శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదు..

కమిషనరేట్​ పరిధిలో శాంతిభద్రతల విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడేది లేదని ఐజీ పేర్కొన్నారు. నిందితుడు రియజ్​ కోసం సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలిస్తున్నారన్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.