అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: constable murder case | కమిషనరేట్ పరిధిలోని సీసీఎస్ విభాగంలో పనిచేసే కానిస్టేబుల్ ప్రమోద్ Constable Pramod దారుణ హత్యోదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు రియాజ్ పోలీసులకు పట్టుబడినట్లు ప్రచారం జరుగుతోంది.
పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్ను శుక్రవారం (అక్టోబరు 17) అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా.. కానిస్టేబుల్ ప్రమోద్పై నిందితుడు రియాజ్ కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ ప్రమోద్ను Constable Pramod ఛాతిలో పొడిచి పారిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ పరిస్థితి విషమించడంతో మరణించారు.
కాగా.. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న కమిషనరేట్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. డీజీపీ సైతం ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. ఐజీని ప్రత్యేకంగా రంగంలోకి దింపారు. అనంతరం నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
constable murder case | ఆరో ఠాణా పరిధిలో..
నిజామాబాద్ ఆరో ఠాణా పరిధిలో నిందితుడు రియాజ్ ఉన్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి ఆరో ఠాణా పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
నిందితుడు రియాజ్ ఉపయోగించిన బైక్ .. స్థానిక కెనాల్ canal సమీపంలో లభించింది. అంటే నిందితుడు కెనాల్లోని నీటిలో దూకి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. దీంతో డ్రోన్ల (Drone) సాయంతో నిందితుడి కోసం జల్లెడ పట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం సారంగపూర్ శివారులో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారని ప్రచారం సాగుతోంది. కాగా.. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.