అక్షరటుడే, వెబ్డెస్క్: Constable murder case | నిజామాబాద్ సీసీఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ప్రమోద్ హత్యకు గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై డీజీపీ శివధర్రెడ్డి స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డిని ఆదేశించారు. అలాగే మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను పరామర్శించాలని సూచించారు.
వారికి అవసరమైన సాయం చేయాలన్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసి.. వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
Constable murder case | అసలేం జరిగిందంటే..
వాహనాల దొంగతనాలను, చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్న రియాజ్ను సీసీఎస్ పోలీసులు పట్టుకుని స్టేషన్కు తీసుకొస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ను నిందితుడు కత్తితో పొడిచి పరారయ్యాడు.
కత్తితో ఛాతిలో పొవడంతో కానిస్టేబుల్ కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రమోద్ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడం మృతి చెందాడు.
నిందితుడి ప్రమోద్తో పాటు సీసీఎస్ ఎస్సై, కానిస్టేబుల్ అల్లుడిపై సైతం దాడికి పాల్పడ్డాడు. వారి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. వెంటనే పోలీసు బృందాలను రంగంలోకి దించారు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.