ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | మహిళను దూషించిన కేసులో కానిస్టేబుల్​కు జైలు

    Nizamabad City | మహిళను దూషించిన కేసులో కానిస్టేబుల్​కు జైలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad City | మహిళను దూషించిన కేసులో న్యాయస్థానం ఓ కానిస్టేబుల్​కు జైలుశిక్ష విధించింది. అతడితో పాటు మరో ఇద్దరికి సైతం కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

    వివరాల్లోకి వెళ్తే.. కోటగిరి (Kotagiri) మండల కేంద్రంలోని చావిడి గల్లీలో నివాసముండే గైని రామవ్వ తన ఇంటి దగ్గర ఉండే చెల్లెడిగే సుగుణకు చెందిన స్థలాన్ని కొనుగోలు చేసింది. అక్కడ షెడ్​ వేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

    అయితే ఆ స్థలం విషయంలో 2021 మార్చి 28వ తేదీన అదే కాలనీకి చెందిన పోలీస్​ కానిస్టేబుల్ (Police Constable)​ బర్ల ప్రవీణ్​కుమార్​, తన తండ్రి బర్ల భూమయ్య, తమ్ముడు బర్ల నవీన్​ కలిసి రామవ్వతో గొడపపడ్డారు. ఆమెను కులంపేరుతో దూషించారు. చేతులతో కొట్టి దాడి చేశారు.

    దీంతో రామవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరారోపణలను పరిశీలించిన న్యాయమూర్తి ముద్దాయిలైన ప్రవీణ్​కుమర్​, భూమయ్య, నవీన్​లకు మూడేళ్ల మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే రూ. వెయ్యి జరిమానా సైతం విధించారు.

    More like this

    Nizamabad KFC | నిజామాబాద్​ కేఎఫ్​సీలో కుల్లిపోయిన చికెన్​.. సిబ్బందితో వినియోగదారుడి వాగ్వాదం!

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC : ఇటీవల ఫుడ్​ సెంటర్లు బాగా పాపులర్​ అయ్యాయి. జనాలు ఎగబడి తింటున్నారు....

    Medicover Hospital | మెడికవర్​ ఆస్పత్రిలో చిన్నారికి అరుదైన చికిత్స

    అక్షరటుడే, ఇందూరు: Medicover Hospital | నిజామాబాద్​ నగరంలోని మెడికవర్​ ఆస్పత్రిలో మూడేళ్ల చిన్నారికి వైద్యులు అరుదైన చికిత్స...

    Mancherial | యువతి ఆత్మహత్య.. విషయం తెలిసి బావిలో దూకిన ప్రియుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mancherial మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య...