Homeక్రైంHyderabad | డ్రగ్స్ దందాలో కానిస్టేబుల్.. పోలీసుల దాడితో పరార్​​

Hyderabad | డ్రగ్స్ దందాలో కానిస్టేబుల్.. పోలీసుల దాడితో పరార్​​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ పోలీసులు (hyderabad police) డ్రగ్స్​ ముఠాను అరెస్ట్​ చేశారు. ఈ కేసులో ఓ కానిస్టేబుల్​ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల దాడితో అతడు తప్పించుకున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కుక్కట్​పల్లిలో డ్రగ్స్​ గ్యాంగ్​పై సోమవారం దాడి చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి 800 గ్రాముల ఎపిడ్రిన్​, హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆంధ్రప్రదేశ్(AP)​లోని అద్దంకికి చెందిన వారిగా గుర్తించారు. పరారీలో ఉన్న కానిస్టేబుల్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. సదరు కానిస్టేబుల్​ తిరుపతికి చెందినవాడని సమాచారం.

Hyderabad | యథేచ్ఛగా డ్రగ్స్​ దందా

తెలంగాణలో డ్రగ్స్​ దందా యథేచ్ఛగా సాగుతోంది. హైదరాబాద్ లాంటి​ నగరాల్లో భారీగా డ్రగ్స్​ వినియోగిస్తున్నారు. మారుమూల పల్లెల్లో సైతం గంజాయి విక్రయాలు చేపడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎంతో మంది యువత డ్రగ్స్, గంజాయికి బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పోలీసులు (Police) దాడులు చేసి, డ్రగ్స్​ విక్రేతలను అరెస్ట్​ చేస్తున్నారు. అయితే మూలాలను పట్టుకోవడంలో వారు విఫలం అవుతుండటంతో డ్రగ్స్​, గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోంది.

నగర శివారులోని షాద్​నగర్​ (Shadnagar)లో గల ఓ దాబాలో ఇటీవల పోలీసులు రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టుకున్నారు. దాబాలో వంటవాడిగా పనిచేసే ఓ వ్యక్తి వద్ద భారీగా డ్రగ్స్​ పట్టుబడటం గమనార్హం. నగరంలో చాలా ప్రాంతాల్లో డ్రగ్స్​ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వం స్పందించి డ్రగ్స్​ దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.