HomeతెలంగాణTelangana University | దోస్త్​ ప్రత్యేక కేటగిరి విద్యార్థుల దరఖాస్తుల పరిశీలన

Telangana University | దోస్త్​ ప్రత్యేక కేటగిరి విద్యార్థుల దరఖాస్తుల పరిశీలన

- Advertisement -

అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెయూ పరిధిలో దోస్త్​(DOST) ఆన్​లైన్​ డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించనున్నట్లు దోస్త్​ కో-ఆర్డినేటర్​ డాక్టర్​ వాసం చంద్రశేఖర్​ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక కేటగిరీలైన పీహెచ్​సీ, ఎన్​సీసీ, స్పోర్ట్స్​ తదితర కేటగిరీల విద్యార్థులు ఈనెల 9న తమ ఒరిజినల్​ ధ్రువపత్రాలతో తెయూలోని అడ్మిషన్స్​ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. రెండు సెట్ల జిరాక్స్​ సెట్​లు సైతం వెంట తీసుకురావాలని సూచించారు.