Homeతాజావార్తలుJubilee Hills counting | జూబ్లీహిల్స్​లో కాంగ్రెస్​ ఘన విజయం

Jubilee Hills counting | జూబ్లీహిల్స్​లో కాంగ్రెస్​ ఘన విజయం

జూబ్లీహిల్స్​ ఉన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి ఘన విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills counting | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్ ఘన విజయం (Congress candidate Naveen Yadav won) సాధించారు. పది రౌండ్ల కౌంటింగ్​ ప్రక్రియ పూర్తయింది. ఆఖరి రౌండ్​లో సైతం హస్తం పార్టీ ఆధిక్యం సాధించింది.

రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్​ ఎన్నికల (Jubilee Hills election) కౌంటింగ్​ ప్రక్రియ పూర్తయింది. ఈ స్థానంలో గెలుపు కోసం కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ తీవ్రంగా శ్రమించాయి. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్​ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​, ఇతర నేతలు సైతం జోరుగా ప్రచారం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత, గోపినాథ్​ మృతితో సానుభూతి కలిసి వచ్చి తాము గెలుస్తామని బీఆర్​ఎస్​ భావించింది. అయితే ప్రజలు మాత్రం కాంగ్రెస్​కు పట్టం కట్టారు. నవీన్​ యాదవ్​ గెలుపుపై ఎన్నికల సంఘం కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనుంది.

Jubilee Hills counting | భారీ మెజారిటీతో..

పదో రౌండ్​ కౌంటింగ్​లోనూ కాంగ్రెస్​ ఆధిక్యం సాధించింది. దాదాపు 25 వేల ఓట్ల మెజారిటీతో బీఆర్​ఎస్​ అభ్యర్థి సునీతపై (BRS candidate Sunitha) నవీన్​యాదవ్​ విజయం సాధించారు. రెండు పార్టీల మధ్య స్వల్ప ఓట్ల తేడా మాత్రమే ఉంటుందని, పోరు హోరాహోరీగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్​ భారీ విజయం సాధించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కాగా కౌంటింగ్​లో భాగంగా.. తొలి రౌండ్​ నుంచి కాంగ్రెస్​ పార్టీ జోరు కొనసాగింది. అన్ని రౌండ్లలో ఆ పార్టీ అభ్యర్థి లీడ్​ సాధించారు. ఒక్కసారి కూడా మాగంటి సునీత పోటీలోకి రాకపోవడం గమనార్హం.

Jubilee Hills counting | ఆధిక్యం వివరాలు

కాంగ్రెస్​ తొలిరౌండ్​లో 47 ఓట్లు, రెండో రౌండ్​లో 2,947, మూడో రౌండ్‌లో 2,843 ఓట్ల లీడ్​ సాధించింది. నాలుగో రౌండ్‌లో 3,558, ఐదో రౌండ్​లో 3,178, ఆరో రౌండ్​లో 2,938, ఏడో రౌండ్​లో 4,030, ఎనిమిదో రౌండ్​లో 1,876, తొమ్మిదో రౌండ్​లో 2,117 ఓట్ల ఆధిక్యం సాధించారు. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్​రెడ్డి (BJP candidate Deepak Reddy) డిపాజిట్​ కోల్పోయారు. ఈ గెలుపుతో సీఎం రేవంత్​రెడ్డి సహా కాంగ్రెస్​ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం సాయంత్రం నాలుగు గంటలకు మంత్రులతో సమావేశం కానున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.

Must Read
Related News