Homeతాజావార్తలుJubilee Hills counting | కాంగ్రెస్​ గెలుపు ఖాయం.. ఎనిమిదో రౌండ్​లోనూ ఆధిక్యం

Jubilee Hills counting | కాంగ్రెస్​ గెలుపు ఖాయం.. ఎనిమిదో రౌండ్​లోనూ ఆధిక్యం

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు దాదాపుగా ఖాయం అయిపోయింది. ఆది నుంచి హస్తం పార్టీ అభ్యర్థి లీడ్​లో ఉంటున్నారు. ప్రస్తుతం 8 రౌండ్ల కౌంటింగ్​ ప్రక్రియ పూర్తయింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills counting | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) కాంగ్రెస్​ గెలుపు దాదాపుగా ఖాయం అయిపోయింది. ఆది నుంచి హస్తం పార్టీ అభ్యర్థి లీడ్​లో ఉంటున్నారు. ప్రస్తుతం 8 రౌండ్ల కౌంటింగ్​ ప్రక్రియ పూర్తయింది. ఈ రౌండ్​లో కాంగ్రెస్​ 1,876 ఆధిక్యం సాధించింది.

ఉదయం 8 గంటలకు కోట్ల విజయ భాస్కర్​ రెడ్డి స్టేడియంలో (Kotla Vijaya Bhaskar Reddy Stadium) కౌంటింగ్​ ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలి నుంచి నవీన్​ యాదవ్​ ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్​లో పోటీ ఇచ్చిన బీఆర్​ఎస్​ ఆ తర్వాత వెనుకబడిపోయింది. ఇప్పటి వరకు ఒక్క రౌండ్​లో కూడా ఆ పార్టీ ఆధిక్యం సాధించలేదు. ఇప్పటి వరకు 8 రౌండ్ల కౌంటింగ్​ పూర్తి కాగా.. మరో రెండు రౌంట్లు మిగిలి ఉన్నాయి. మరో గంటలో ఫైనల్​ రిజల్ట్​ తేలనుంది. ఎనిమిదో రౌండ్​లో కాంగ్రెస్​ 1,876 ఓట్ల లీడ్​ సాధించగా.. మొత్తం 21,495 మెజారిటీతో గెలుపు దిశగా సాగుతోంది.

Jubilee Hills counting | రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు..

పోస్టల్‌ బ్యాలెట్‌లో (postal ballot) బీఆర్ఎస్ – 36, కాంగ్రెస్ – 39, బీజేపీ – 10 పోస్టల్​ ఓట్లు సాధించాయి. తొలి రౌండ్​లో కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ (Naveen Yadav) 8,911, బీఆర్​ఎస్​ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) 8,864 ఓట్లు సాధించారు. బీజేపీ 2,167 ఓట్లు సాధించింది. ఐదో రౌండ్​ పూర్తయ్యే సరికి కాంగ్రెస్​ 50,849, బీఆర్​ఎస్​ 37,990, బీజేపీ 8,569 ఓట్లు సాధించాయి.

కాంగ్రెస్​ తొలిరౌండ్​లో 47 ఓట్లు, రెండో రౌండ్​లో 2,947, మూడో రౌండ్‌లో 2,843, నాలుగో రౌండ్‌లో 3,558 ఐదో రౌండ్​లో 3,178, ఆరో రౌండ్​లో 2,938, ఏడో రౌండ్​లో 4,030, ఎనిమిదో రౌండ్​లో 1,876 ఓట్ల ఆధిక్యం కనబరిచింది. కాంగ్రెస్​ గెలుపు ఖాయం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్​ నెలకొంది. గాంధీ భవన్​ వద్ద సందడి నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీ భవన్​కు (Gandhi Bhavan) వస్తున్నారు. మరోవైపు బీఆర్​ఎస్​ కార్యాలయం వెలవెలబోతుంది. ఉదయం పలువురు నాయకులు కార్యాలయానికి రాగా.. ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు.

ఐదో రౌండ్​ కౌంటింగ్​ పూర్తవగానే.. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్​ హాల్ నుంచి వెళ్లిపోయారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించారు. చివరి మూడు రౌండ్లు తమకు అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. తనకు డిపాజిట్ వస్తుందనే భావిస్తున్నట్లు చెప్పారు.

Must Read
Related News