అక్షరటుడే, వెబ్డెస్క్ : Jubilee Hills counting | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills by-election) కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది. నాలుగో రౌండ్లోనూ కాంగ్రెస్ లీడ్ కనబరిచింది. నాలుగో రౌండ్ ముగిసే సరికి ఆ పార్టీ 9 వేల ఓట్లకుకు పైగా మెజారిటీతో ఉంది.
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ (Congress and BRS) మధ్య పోరు నడిచింది. రెండు పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాయి. అయితే ఓటర్లు మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ (Congress party) లీడ్లో సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ (postal ballots), తొలిరౌండ్లో స్వల్ప ఆధిక్యం సాధించిన హస్తం పార్టీ, రెండు, మూడు, నాలుగు రౌండ్లలో భారీ మెజారిటీ సాధించింది.
Jubilee Hills counting | నాలుగో రౌండ్లో..
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. మొత్తం 10 రౌండ్లలో ఫలితం తేలనుంది. ఇప్పటి వరకు షేక్పేట, రహ్మత్నగర్, ఎర్రగడ్డ (Rahmatnagar and Erragadda) డివిజన్లలో కౌంటింగ్ పూర్తయింది. మూడో రౌండ్లో నవీన్ యాదవ్ 3,100 ఓట్ల ఆధిక్యం సాధించారు. మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్ 6,047 ఓట్ల ఆధిక్యం ఉంది. పోస్టల్ బ్యాలెట్లో బీఆర్ఎస్ – 36, కాంగ్రెస్ – 39, బీజేపీ – 10 పోస్టల్ ఓట్లు సాధించాయి.
తొలి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 8,911, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (BRS candidate Maganti Sunitha) 8,864 ఓట్లు సాధించారు. బీజేపీ 2,167 ఓట్లు సాధించింది. రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్కు 17,874, బీఆర్ఎస్కు 14,879 ఓట్లు పోల్ అయ్యాయి. బీజేపీ అభ్యర్థి 3,475 ఓట్లు సాధించారు. నాలుగు రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) 3,100 ఓట్లు మెజారిటీ సాధించారు. మొత్తం 9 వేలకు పైగా మెజారిటీలో కాంగ్రెస్ కొనసాగుతోంది.
