అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kamareddy Municipal Elections | జహీరాబాద్ పార్లమెంట్ (Zaheerabad Parliamentary) పరిధిలో ‘మున్సిపల్’ సమరానికి కాంగ్రెస్ పార్టీ సన్నద్ధంగా ఉండాలని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్కుమార్ గౌడ్ (PCC Chief Bomma Mahesh Kumar Goud) సూచించారు. ఈ మేరకు హైదరాబాద్లోని గాంధీ భవన్లో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి మంత్రి అజహరుద్దీన్ (Minister Azharuddin) నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు.
Kamareddy Municipal Elections | నాయకులకు దిశానిర్దేశం..
ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నేతలకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థంగా తీసుకెళ్లే విధానాలపై సమాలోచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డిలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని పేర్కొన్నారు.
Kamareddy Municipal Elections | టికెట్ ఎవరికి వచ్చినా..
ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ క్యాడర్ మొత్తం ఏకతాటిపై ఉండాలని.. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. సంజీవ్ రెడ్డి, కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, అలాగే జహీరాబాద్ పార్లమెంట్లోని కార్పొరేషన్ ఛైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.