Homeతాజావార్తలుJubilee Hills counting | విజయం దిశగా కాంగ్రెస్​.. తొమ్మిదో రౌండ్​లోనూ ఆధిక్యం

Jubilee Hills counting | విజయం దిశగా కాంగ్రెస్​.. తొమ్మిదో రౌండ్​లోనూ ఆధిక్యం

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయం ఖరారు అయిపోయింది. తొమ్మిదో రౌండ్​ ముగిసే సరికి 23,612 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్​ అభ్యర్థి ఉన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills counting | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) కాంగ్రెస్​ గెలుపు దాదాపుగా ఖాయం అయిపోయింది. ఆది నుంచి హస్తం పార్టీ జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం 9 రౌండ్ల కౌంటింగ్​ ప్రక్రియ పూర్తయింది. ఈ రౌండ్​లో కాంగ్రెస్​ అభ్యర్థి 2,117 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.

కోట్ల విజయ భాస్కర్​ రెడ్డి స్టేడియంలో (Kotla Vijaya Bhaskar Reddy Stadium) కౌంటింగ్​ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. అయితే పోరు హోరాహోరీగా ఉంటుందని అంతా భావించారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ (Congress and BRS) మధ్య పోటీ ఉంటుందని అనుకున్నారు. అయితే తొలి రౌండ్​ నుంచి కాంగ్రెస్​ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. తొలి రౌండ్​లో నువ్వా నేనా అన్నట్లు ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్​ స్వల్ప మెజారిటీ మాత్రమే సాధించింది. అయితే అనంతరం అన్ని రౌండ్లలో కాంగ్రెస్​ దూసుకు వెళ్తొంది. దీంతో కాంగ్రెస్​ గెలుపు ఖాయమైంది. దీంతో కాంగ్రెస్​ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తొమ్మిదో రౌండ్​లో 2,117 ఆధిక్యం రాగా.. మొత్తం 23,612 ఓట్ల లీడ్​లో నవీన్​ యాదవ్​ ఉన్నారు.

Jubilee Hills counting | ఆధిక్యం వివరాలు

తొలి రౌండ్​లో కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ (Congress candidate Naveen Yadav) 8,911, బీఆర్​ఎస్​ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) 8,864 ఓట్లు సాధించారు. బీజేపీ 2,167 ఓట్లు సాధించింది. ఐదో రౌండ్​ పూర్తయ్యే సరికి కాంగ్రెస్​ 50,849, బీఆర్​ఎస్​ 37,990, బీజేపీ 8,569 ఓట్లు సాధించాయి. ఆరో రౌండ్​ ముగిసే సరికి నవీన్​ యాదవ్​ 60,402 ఓట్లు, సునీత 44,605, దీపక్​రెడ్డి 10,235 ఓట్లు సాధించారు.

కాంగ్రెస్​ తొలిరౌండ్​లో 47 ఓట్లు, రెండో రౌండ్​లో 2,947, మూడో రౌండ్‌లో 2,843 ఓట్ల లీడ్​ సాధించింది. నాలుగో రౌండ్‌లో 3,558, ఐదో రౌండ్​లో 3,178, ఆరో రౌండ్​లో 2,938, ఏడో రౌండ్​లో 4,030, ఎనిమిదో రౌండ్​లో 1,876 ఓట్ల ఆధిక్యంతో దూసుకు పోతుంది.

Jubilee Hills counting | ప్రజలు సంతృప్తిగా ఉన్నారు

కాంగ్రెస్​ గెలుపు ఖాయం కావడంతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్​ (PCC President Mahesh Goud) మీడియాతో మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్​ పాలనపై సంతృప్తిగా ఉన్నారన్నారు. అందుకు ఈ ఫలితాలే నిదర్శనమని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ వంద స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Must Read
Related News