Harish Rao | ప్రాజెక్ట్​లను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | రాష్ట్రంలోని ప్రాజెక్ట్​లను కాంగ్రెస్​ ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) ఆరోపించారు. పెండింగ్​ ప్రాజెక్ట్​లను (pending projects) పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ భవన్​లో (Telangana Bhavan) కృష్ణా జలాలపై హరీశ్​రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్​ ఇచ్చారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | రాష్ట్రంలోని ప్రాజెక్ట్​లను కాంగ్రెస్​ ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) ఆరోపించారు. పెండింగ్​ ప్రాజెక్ట్​లను (pending projects) పట్టించుకోవడం లేదన్నారు.

తెలంగాణ భవన్​లో (Telangana Bhavan) కృష్ణా జలాలపై హరీశ్​రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్​ ఇచ్చారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ అన్నారు. నల్గొండ జిల్లాకు మరణశాసనం రాసింది కూడా కాంగ్రెస్సే అని ధ్వజమెత్తారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుకు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆయన ఆరోపించారు.

Harish Rao | కాళేశ్వరంపై కక్ష

లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే సంకల్పంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్​పై కాంగ్రెస్​ కక్ష కట్టిందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్​ను పూర్తి చేయడకుండా రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. 2004-14 వరకు కాంగ్రెస్ పాలనలో 6. 64 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 48.74 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు ఇచ్చామని వెల్లడించారు. తొలి నుంచి కాంగ్రెస్​ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను 11వ షెడ్యూల్‌లో పెట్టకుండా ద్రోహం చేసిందని ఆరోపించారు.

Related articles

Kishtwar Encounter Operation | జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishtwar Encounter Operation | జమ్మూ కశ్మీర్​లో ఆదివారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు....

Kamareddy College Land Dispute | ముదురుతున్న కళాశాల ఆస్తుల వివాదం.. ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt Degree College) ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ ఆరోపణలకు అస్త్రంగా మారుతూనే ఉంది.

Vemula Prashanth Reddy Protest | రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా : మాజీ మంత్రి వేముల

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు.

Revanth Reddy Projects Completion | రెండేళ్లలో పెండింగ్​ ప్రాజెక్ట్​లు పూర్తి చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

రాష్ట్రంలో పెండింగ్​ ప్రాజెక్ట్​లను రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో దేవాదుల ప్రాజెక్ట్​ను ఆదివారం ఆయన సందర్శించారు.