అక్షరటుడే, వెబ్డెస్క్ : Jubilee Hills counting | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills by-election) కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మూడో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం సాధించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. మొదటి రెండు రౌండ్లలో షేక్ పేట డివిజన్ (Sheikh Peta division) ఓట్లు లెక్కించారు.
మూడో రౌండ్లో నవీన్ యాదవ్ (Naveen Yadav) 3,100 ఓట్ల ఆధిక్యం సాధించారు. మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్ 6,047 ఓట్ల ఆధిక్యం ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను (postal ballot votes) లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కు ఆధిక్యం కనబరిచింది. బ్యాలెట్ మొత్తం 101 ఓట్లు పోల్ కాగా.. బీఆర్ఎస్ – 36, కాంగ్రెస్ – 39, బీజేపీ – 10 పోస్టల్ ఓట్లు సాధించాయి.
తొలి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 8,911, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) 8,864 ఓట్లు సాధించారు. బీజేపీ 2,167 ఓట్లు సాధించింది. తొలి రౌండ్లో నవీన్ యాదవ్ 47 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. రెండో రౌండ్లో కాంగ్రెస్కు 9,691, బీఆర్ఎస్కు 8,609 ఓట్లు పోల్ అయ్యాయి. రెండో రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్కు 17,874, బీఆర్ఎస్కు 14,879 ఓట్లు పోల్ అయ్యాయి. బీజేపీ అభ్యర్థి 3,475 ఓట్లు సాధించారు. రెండు రౌండ్లు ముగిసే సరికి నవీన్ యాదవ్ 2,945 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 10 రౌండ్లలో ఫలితం తేలనుంది. ఇప్పటి వరకు షేక్పేట, రహ్మత్నగర్, ఎర్రగడ్డ డివిజన్లలో కౌంటింగ్ పూర్తయింది. నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
