Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Congress | డీఎస్​కు కాంగ్రెస్​ నాయకుల నివాళి

Nizamabad Congress | డీఎస్​కు కాంగ్రెస్​ నాయకుల నివాళి

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Congress | దివంగత మాజీ మంత్రి డి.శ్రీనివాస్ (D Srinivas)​ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్​ నాయకులు నివాళులర్పించారు. కంఠేశ్వర్​ బైపాస్​లో (Kanteshwar Bypass) డీఎస్​ విగ్రహానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ (Government Advisor Shabbir Ali), ఎమ్మెల్యేలు సుదర్శన్​ రెడ్డి (Mla Sudharshan reddy), భూపతిరెడ్డి (Mla Bhupathi reddy) తదితరులు నివాళులర్పించారు.

Nizamabad Congress | జిల్లా అభివృద్ధికి విశేష కృషి..

అనంతరం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ మాట్లాడుతూ.. డీఎస్​ నిజామాబాద్​ జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్​కు ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి పాటుపడ్డాడని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేలు సుదర్శన్​ రెడ్డి, భూపతిరెడ్డిలు మాట్లాడుతూ.. కాంగ్రెస్​ నాయకులు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాసేవకు అంకితం కావాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్​ రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​ బిన్​ హందాన్​, కాంగ్రెస్​ పార్టీ పట్టణాధ్యక్షుడు కేశ వేణు, సీనియర్​ నాయకులు అంతిరెడ్డి రాజిరెడ్డి, నరాల రత్నాకర్ ​ తదితరులు పాల్గొన్నారు.