Muthyala Sunil Reddy | జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్​ నేత సునీల్​ రెడ్డి అరెస్ట్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Muthyala Sunil Reddy | జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్​ నాయకుడు అరెస్ట్​ అయ్యారు. నిజామాబాద్​ జిల్లా (Nizamabad District) బాల్కొండ కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​ఛార్జి సునీల్​రెడ్డిని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (Directorate General of GST Intelligence) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముత్యాల సునీల్​రెడ్డి కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​ఛార్జిగా ఉన్నారు. ఆరెంజ్‌ ప్యాసింజర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీగా సైతం కొనసాగుతున్నారు. అధికారులు సేకరించిన సమాచారం ఆధారంగా.. మోసపూరిత నెట్​వర్క్​ను […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Muthyala Sunil Reddy | జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్​ నాయకుడు అరెస్ట్​ అయ్యారు. నిజామాబాద్​ జిల్లా (Nizamabad District) బాల్కొండ కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​ఛార్జి సునీల్​రెడ్డిని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (Directorate General of GST Intelligence) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ముత్యాల సునీల్​రెడ్డి కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​ఛార్జిగా ఉన్నారు. ఆరెంజ్‌ ప్యాసింజర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీగా సైతం కొనసాగుతున్నారు. అధికారులు సేకరించిన సమాచారం ఆధారంగా.. మోసపూరిత నెట్​వర్క్​ను నడుపుతున్న ఇద్దరిని అధికారులు అరెస్ట్​ చేశారు. ఇందులో కాంగ్రెస్​ నేత ముత్యాల సునీల్​రెడ్డి కూడా ఉండటం గమనార్హం.

Muthyala Sunil Reddy | రూ.28 కోట్ల ఎగవేత

రాష్టవ్యాప్తంగా పన్ను ఎగవేతకు పాల్పడిన వారిని గుర్తించడానికి డీజీజీఐ అధికారులు (DGGI Officers) ఇటీవల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా సునీల్​రెడ్డి రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేశాడని గుర్తించారు. మూడు నెలల గడువు ముగిసినా జీఎస్టీ చెల్లించకపోవడంతో తాజాగా జీఎస్టీ చట్టం 2017 ప్రకారం అరెస్ట్​ చేశారు. ఆరెంజ్​ ట్రావెల్స్​ ఎండీగా ఉన్న ఆయన రూ.28.24 కోట్ల జీఎస్టీని వినియోగదారుల నుంచి వసూలు చేశారు. అయితే దానిని ప్రభుత్వానికి చెల్లించలేదని అధికారులు పేర్కొన్నారు. మరో వ్యక్తి ట్రిలియన్‌ లీడ్‌ ఫ్యాక్టరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ చేతన్‌ ఎన్‌ సైతం రూ.22 కోట్ల విలువైన నకిలీ ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (Input Tax Credit) సృష్టించి మోసం చేశాడు. అతడిని సైతం అధికారులు అరెస్ట్​ చేశారు.

కాగా సునీల్​రెడ్డి కాంగ్రెస్​లో కీలకంగా కొనసాగుతున్నారు. 2018లో ఆయన బాల్కొండ (Balkonda) నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2023 ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి పోటీ చేసి వేముల ప్రశాంత్​రెడ్డిపై మరోసారి ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం ఆయన కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన నేత జీఎస్టీ ఎగవేత కేసులో అరెస్ట్​ కావడం తీవ్ర చర్చనీయాంశం అయింది.

Related articles

Hitler police station | పోలీస్​ ఠాణాగా హిట్లర్​ హోం.. రూ. 247 కోట్లతో రెనోవేషన్​!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hitler police station | ఆస్ట్రియా దేశ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన  జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్...

Kishtwar Encounter Operation | జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishtwar Encounter Operation | జమ్మూ కశ్మీర్​లో ఆదివారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు....

Kamareddy College Land Dispute | ముదురుతున్న కళాశాల ఆస్తుల వివాదం.. ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt Degree College) ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ ఆరోపణలకు అస్త్రంగా మారుతూనే ఉంది.

Vemula Prashanth Reddy Protest | రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా : మాజీ మంత్రి వేముల

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు.