HomeజాతీయంBihar results | బీహార్​ ఫలితాలపై కాంగ్రెస్​ కీలక వ్యాఖ్యలు

Bihar results | బీహార్​ ఫలితాలపై కాంగ్రెస్​ కీలక వ్యాఖ్యలు

బీహార్​ ఫలితాలపై తమకు అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ఖర్గే నివాసంలో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bihar results | బీహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar assembly elections) కాంగ్రెస్​ కూటమి ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అధికార ఎన్డీయే కూటమి (NDA alliance) 202 స్థానాల్లో విజయం సాధించగా.. మహఘట్​బంధన్​ కూటమి (Mahaghatbandhan alliance) 34 స్థానాలకే పరిమితమైంది.

61 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్​ ఆరు చోట్ల మాత్రమే గెలిచింది. దీంతో బీహార్‌ ఓటమిపై ఆ పార్టీ పోస్టుమార్టం నిర్వహిస్తోంది. బీహార్​ ఓటమిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే (Congress president Kharge) నివాసంలో పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ మీటింగ్​ లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), కేసీ వేణుగోపాల్‌, అజయ్‌ మాకెన్‌ తదితరులు హాజరయ్యారు. మీటింగ్​ అనంతరం వేణుగోపాల్ మాట్లాడుతూ.. బీహార్‌ ఫలితాన్ని నమ్మలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఫలితాలపై తమతో పాటు ప్రజలకూ అనుమానాలు ఉన్నాయన్నారు. ఎన్నికల కమిషన్‌ తీరుపై సందేహాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్‌ ఓటమిపై పూర్తిస్థాయిలో సమీక్ష జరుపుతామని తెలిపారు.

Bihar results | మోసంతో గెలిచింది

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మోసం ద్వారా గెలిచిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ ఆరోపించారు. భారత ప్రజాస్వామ్యం చాలా తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. బీహార్‌లో రిగ్గింగ్ జరిగింది అని ఆరోపించారు. హర్యానాలో కూడా తాము ఇదే చెప్పామన్నారు. ఇప్పటివరకు తాము లేవనెత్తిన అంశాలపై ఎన్నికల కమిషన్ స్పందించలేదన్నారు. ప్రజలు NDAకి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, ఆ ఓటు నమోదు కావడం లేదన్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు, ప్రజా నిరసనలతో తాము ముందుకు సాగుతామని తెలిపారు.

Must Read
Related News