HomeతెలంగాణKTR | విజయగర్వంతో కాంగ్రెస్​ గూండాయిజం.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

KTR | విజయగర్వంతో కాంగ్రెస్​ గూండాయిజం.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

రహమత్ నగర్​లో కాంగ్రెస్​ నేతల దాడిలో గాయపడ్డ బీఆర్​ఎస్ కార్యకర్త రాకేశ్​ను బీఆర్​ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ పరామర్శించారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | జూబ్లీహిల్స్​ (Jubilee Hills)లో గెలవడంతో కాంగ్రెస్​ (Congress) పార్టీ విజయగర్వంతో గూండాయిజానికి పాల్పడుతోందని బీఆర్ఎస్​ (BRS) వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. రహమత్‌నగర్‌లో తమ పార్టీ కార్యకర్త రాకేశ్‌ను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

జూబ్లీహిల్స్​లో కాంగ్రెస్​ భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని రహమత్ నగర్‌లో బీఆర్​ఎస్​ కార్యకర్త రాకేశ్​పై శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్​ నాయకులు దాడి చేశారు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను శనివారం కేటీఆర్​ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫలితాలు వచ్చి 24 గంటలు దాటక ముందే కాంగ్రెస్‌ గూండాయిజం చేస్తోందన్నారు. తాము అనేక ఎన్నికల్లో గెలిచామని, ఎప్పుడు దాడులు చేయలేదన్నారు.

KTR | కార్యకర్తలను కాపాడుకుంటాం

విజయగర్వంతోనే కాంగ్రెస్​ నాయకులు శుక్రవారం ఊరేగింపు నిర్వహించారని కేటీఆర్​ విమర్శించారు. బీఆర్​ఎస్​ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. దొంగ ఓట్లు, గూండాగిరి, డబ్బులు పంచి ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. కాంగ్రెస్​ విజయోత్సవ ఊరేగింపుతోనే ఎవరిది అహంకారమో తేలిపోయిందన్నారు. గతంలో తాము అనేక ఉప ఎన్నికల్లో గెలిచామన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్​కు డిపాజిట్​ కూడా రాలేదన్నారు. అందుకని ఆ పార్టీ గుర్తును గాడిద మీద వేసి ఊరేగించామా అని ప్రశ్నించారు. తమ కార్యకర్తల మీద దాడి చేసిన వారిని వదిలిపెట్టమని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ దాడి ఘటనపై మధురానగర్​ పోలీసులు కేసు నమోదు చేశారు.

Must Read
Related News