HomeజాతీయంPM Modi | ఆపరేషన్​ సిందూర్​తో కాంగ్రెస్​కు నిద్రలేని రాత్రులు.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు

PM Modi | ఆపరేషన్​ సిందూర్​తో కాంగ్రెస్​కు నిద్రలేని రాత్రులు.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు

ఆపరేషన్​ సిందూర్​తో పాకిస్థాన్​తో పాటు కాంగ్రెస్​ రాజకుటుంబం సైతం నిద్రలేని రాత్రులు గడిపిందని ప్రధాని మోదీ అన్నారు. బీహార్​ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) బీహార్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేశారు.

ఆపరేషన్​ సిందూర్​ (Operation Sindoor) సమయంలో కాంగ్రెస్​ రాజకుటుంబం నిద్రలేని రాత్రులు గడిపిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్​లో బాంబులు పడుతుంటే ఇక్కడ వారు ఆందోళన చెందారని ఆరోపించారు. బీహార్​లోని ఆరాలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గతంలో ఆర్జేడీ పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. జంగల్‌రాజ్‌ను బిహార్‌ ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు. ఆ నేతలు చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమిని చూస్తారని పేర్కొన్నారు.

PM Modi | కాంగ్రెస్​ తలపై తుపాకీ పెట్టి..

ఆర్జేడీ తుపాకీతో గురిపెట్టి కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి పదవిని లాక్కుందని మోదీ ఆరోపించారు. ఈ కూటమిని “విభజిత ఇల్లు”గా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ డిమాండ్లను మేనిఫెస్టోలో (manifesto) విస్మరించారని పేర్కొన్నారు. తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించేందుకు కాంగ్రెస్​ సిద్ధంగా లేదని మోదీ అన్నారు. అయితే కాంగ్రెస్‌ తలపై తుపాకీ ఎక్కుపెట్టి ఆర్జేడీ ఆ అవకాశాన్ని దక్కించుకుందని ఆరోపించారు. ఎన్డీఏతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్​ కూటమిలో (RJD and Congress alliance) అంతర్గత కలహాలు ఉన్నాయని ఎత్తి చూపారు.

PM Modi | క్షమాపణ చెప్పలేదు

ఢిల్లీలో 1984లో ఇదే సమయంలో సిక్కులను ఊచకోత కోశారని ప్రధాని మోదీ అన్నారు. ఈ మారణహోమం విషయంలో కాంగ్రెస్ ఇంకా క్షమాపణ చెప్పలేదన్నారు. దోషులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కాగా ఇందిరా గాంధీ (Indira Gandhi) హత్య అనంతరం ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో చాలా మంది సిక్కులను హత్య చేశారు. దీనిగురించి నాటి ప్రధాని రాజీవ్​ గాంధీ మాట్లాడుతూ.. పెద్ద వృక్షం కూలితే ప్రకంపనలు సహజం అన్నారు. కాగా.. దీనిపై తాజాగా మోదీ మాట్లాడారు. చొరబాటుదారులను కాపాడేందుకు రాహుల్​ గాంధీ (Rahul Gandhi) ఓటర్​ అధికార్​ యాత్ర చేపట్టారని మోదీ విమర్శించారు. వారిని తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు.