More
    HomeతెలంగాణJubilee Hills | జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్.. కార్పొరేషన్​ ఛైర్మన్లకు బాధ్యతలు

    Jubilee Hills | జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్.. కార్పొరేషన్​ ఛైర్మన్లకు బాధ్యతలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Jubilee Hills | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని జూబ్లీహిల్స్​ నియోజకవర్గం ఉప ఎన్నికపై కాంగ్రెస్​ (Congress) ఫోకస్​ పెట్టింది. ఉప ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని కాంగ్రెస్​ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా కార్పొరేషన్ ఛైర్మన్లకు నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను అప్పగించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పనిచేయాలని మొత్తం 19 మంది కార్పొరేషన్ ఛైర్మన్లకు కాంగ్రెస్​ బాధ్యతలు అప్పగించింది.

    జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​ (Maganti Gopinanh) జూన్​ 8న మృతి చెందారు. బీఆర్​ఎస్ (BRS)​ నుంచి గెలుపొందిన ఆయన మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక రానుంది. ఆరు నెలలలోపు ఎన్నికల సంఘం ఆ స్థానానికి ఎన్నికలు నిర్వహించనుంది. దీంతో ఆ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్​ యోచిస్తోంది. హైదరాబాద్​ ఇన్​ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)​ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

    Jubilee Hills | నగరంలో పట్టు కోసం..

    అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్​ మెజారిటీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే హైదరాబాద్​ మహా నగరం పరిధిలో మాత్రం కాంగ్రెస్​ సీట్లు గెలుచుకోలేకపోయింది. ఎంఐఎం ఏడు, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందగా.. కాంగ్రెస్​ నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి (Malreddy Rangareddy) మాత్రమే విజయం సాధించారు. మిగతా స్థానాల్లో బీఆర్​ఎస్​ గెలుపొందింది. అయితే కంటోన్మెంట్​ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి గెలుపొందారు. ఖైరతాబాద్​ ఎమ్మెల్యేగా బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన దానం నాగేందర్​ కాంగ్రెస్​ గూటికి చేరారు. దీంతో జీహెచ్​ఎంసీ పరిధిలో కాంగ్రెస్​ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది. జూబ్లీహిల్స్​ స్థానాన్ని గెలుపొంది నగరంలో పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్​ భావిస్తోంది. రానున్న జీహెచ్​ఎంసీ ఎన్నికలకు ఇది కీలకంగా మారుతుందని పార్టీ యోచిస్తోంది.

    Jubilee Hills | టికెట్​ కోసం ప్రయత్నాలు

    అధికార కాంగ్రెస్​ పార్టీలో జూబ్లీహిల్స్​ టికెట్​ కోసం తీవ్ర పోటీ ఉంది. చాలా మంది అభ్యర్థులు టికెట్​ ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసి అజారుద్దీన్ (Ajaruddin)​ ఓడిపోయారు. అప్పటి నుంచి తాను నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నానని, తనకే టికెట్​ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. స్థానిక నేతలకే టికెట్​ ఇస్తామని మంత్రి పొన్నం ఇప్పటికే స్పష్టం చేశారు. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వారికి టికెట్​ ఇవ్వబోమని తేల్చి చెప్పారు. అయితే అభ్యర్థి ఎవరనేది మాత్రం అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు.

    పొన్నం వ్యాఖ్యలపై -కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఆయన నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన కూడా ఆసక్తి చూపుతున్నారు. వయనాడ్‌లో రాహుల్‌, ప్రియాంక లోకల్​ అభ్యర్థులా అని ఆయన ప్రశ్నించారు. అభ్యర్థిని ప్రకటించడానికి పెద్ద ప్రాసెస్‌ ఉంటుందని, హైకమాండ్ షార్ట్ లిస్ట్ చేస్తుందని తెలిపారు. టికెట్​ కోసం పలువురు నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.

    Jubilee Hills | ఎన్నిక అప్పుడే..

    మాగంటి గోపినాథ్​ జూన్​ 8న మృతి చెందారు. ఆరు నెలల్లోపు ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ ఏడాది చివరలో బీహార్​ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహార్​ ఎన్నికల (Bihar Election) సమయంలోనే జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ విడుదల చేసే అవకాశం ఉంది.

    More like this

    Armoor RTC | విద్యార్థుల ‘యాత్ర దానం’కు ప్రతిఒక్కరూ చేయూతనందించాలి..

    అక్షరటుడే, ఆర్మూర్: Armoor RTC | విద్యార్థుల ‘యాత్ర దానం’ విహారయాత్రలకు (Excursion) కార్పొరేట్​ సంస్థలు, ఎన్నారైలు, స్వచ్ఛంద...

    Cyber Fraud | డిజిటల్​ అరెస్ట్​ పేరిట బెదిరింపులు.. హార్ట్​ ఎటాక్​తో రిటైర్డ్​ డాక్టర్​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Fraud | సైబర్​ నేరగాళ్ల బెదిరింపులకు ఓ మహిళ బలైపోయింది. డబ్బుల కోసం...

    CP Sai Chaitanya | అదుపుతప్పి రోడ్డుపై పడిపోయిన వ్యక్తికి సాయమందించిన సీపీ..

    అక్షరటుడే, డిచ్​పల్లి: CP Sai Chaitanya | అదుపుతప్పి రోడ్డుపై పడి ఓ వ్యక్తి గాయపడగా.. అటువైపుగా వెళ్తున్న...