అక్షరటుడే, వెబ్డెస్క్ : MP Chamala | పంపకాల్లో వచ్చిన పంచాయితీతోనే కేసీఆర్(KCR) కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి(MP Kiran kumar) అన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలనలో ఎవరేం బాగుపడకపోయినా వాళ్ల కుటుంబం మాత్రం లబ్ధి పొందిందని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను తెలంగాణ ప్రజలు నమ్మాలంటే జరిగిందేంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కవిత మాట్లాడిన దెయ్యాల పేర్లు చెప్పి, ఎలా దోచుకున్నారో కూడా చెప్పాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణను ఏ విధంగా దోచుకున్నారో కవిత లేఖ రాయాలని కోరారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని కవిత కలిసిందనే వార్తల్లో వాస్తవం లేదన్నారు.