అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | కశ్మీర్ వాస్తవ పరిస్థితిపై ఈనెల 28న సదస్సు నిర్వహిస్తున్నట్లు ఇతిహాస సంకలన సమితి(Ithihasa Sankalana Samithi) అధ్యక్ష కార్యదర్శులు మోహన్ దాస్, ఆనంద్ తెలిపారు. నగరంలోని న్యాల్కల్ రోడ్డులోని మున్నూరు కాపు సంఘం (Munnur Kapu Sangham) భవనంలో సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. కశ్మీర్ ఫైల్స్(Kashmir Files) పుస్తక రచయిత ప్రముఖ జర్నలిస్టు రాక సుధాకర్, హైకోర్టు (High Court) న్యాయవాది కాటిపల్లి మహేందర్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.
