HomeతెలంగాణFree Bus | ఆధార్ కార్డు అప్డేట్ చేయలేదని ఫ్రీ టికెట్ ఇవ్వని కండక్టర్

Free Bus | ఆధార్ కార్డు అప్డేట్ చేయలేదని ఫ్రీ టికెట్ ఇవ్వని కండక్టర్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Free Bus | తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్​ హామీ ఇచ్చింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్​ 9న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకాన్ని (Mahalaxmi scheme) ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం మహిళలకు బస్సుల్లో జీరో టికెట్​ ఇస్తారు. పల్లె వెలుగు, ఎక్స్​ప్రెస్​ బస్సుల్లో ఉచిత ప్రయాణం (Free travel) అమలు చేస్తున్నారు. ఉచిత ప్రయాణం అమలు సమయంలో పలువురు కండక్టర్ల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Free Bus | ఆంధ్రప్రదేశ్​ ఉందని..

ఉచిత బస్సు ప్రయాణం కోసం ఒరిజినల్​ ఆధార్​కార్డు (Aadhaar card) లేదా ఓటర్​ ఐడీ కార్డు (voter ID card) కండక్టర్లకు చూపెట్టాలి. అయితే ఆధార్​ కార్డులో ఫొటో కరెక్ట్​ లేదని కొందరు మహిళలకు జీరో టికెట్​ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. తాజాగా ఓ కండక్టర్​ అయితే.. ఆధార్​ కార్డు అప్​డేట్​ చేసుకోలేదని మహిళలకు జీరో టికెట్​ ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్​ (united Andhra Pradesh) సమయంలోనే చాలా మంది ఆధార్​ కార్డులను తీసుకున్నారు. దీంతో కార్డులో అడ్రస్​ దగ్గర ఆంధ్రప్రదేశ్​ అని ఉంటుంది. అయితే తెలంగాణ లేదు అని చెప్పి కండక్టర్​ జీరో టికెట్​ ఇవ్వలేదు. దీంతో ప్రయాణికులు ఆయనతో వాగ్వాదం చేశారు.

భైంసా నుంచి నిజామాబాద్ (Bhainsa to Nizamabad) వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆధార్ కార్డుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడంతో కండక్టర్ జీరో టికెట్ ఇవ్వలేదు. డబ్బులు చెల్లించాలని డిమాండ్​ చేశారు. దీంతో దేగాం గ్రామం వద్ద బస్సును అరగంట పాటు ఆపి మహిళలు గొడవకు దిగారు. అయితే చాలా ఆధార్​ కార్డుల్లో ఆంధ్ర ప్రదేశ్​ అనే ఉంటుంది. ఇప్పటి వరకు ఏ కండక్టర్​ (conductor) కూడా తమను ఆపలేదని మహిళలు అంటున్నారు. కొత్తగా ఇలా టికెట్​ ఇవ్వకపోతే ఎలా అని ఆందోళన చేపట్టారు.

Free Bus | పెరిగిన ఆక్యుపెన్సీ

మహాలక్ష్మి పథకం (Mahalaxmi scheme) అమలు చేయడంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగింది. గతంలో మహిళలు ప్రైవేట్​ వాహనాల్లో సైతం వెళ్లేవారు. అయితే ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సు కోసం నిరీక్షిస్తున్నారు. ఈ పథకానికి ముందు 70 శాతం ఉన్న ఆక్యుపెన్సీ, ఉచిత ప్రయాణం అమలు తర్వాత 93 శాతానికి పెరిగింది. కాగా జులై 23 వరకు మహాలక్ష్మి పథకంలో భాగంగా 200 కోట్ల టికెట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు జులై 23న ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లలో సంబురాలు నిర్వహించారు. జీరో టికెట్ల డబ్బులను ప్రభుత్వం తర్వాత ఆర్టీసీకి విడుదల చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Akshara Today (@aksharatoday)