HomeతెలంగాణBIS Training | జిల్లావాసులకు పూర్తయిన బీఐఎస్‌ శిక్షణ

BIS Training | జిల్లావాసులకు పూర్తయిన బీఐఎస్‌ శిక్షణ

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: BIS Training | న్యూఢిల్లీలో జరిగిన బీఐఎస్‌ (Bureau of Indian Standards) శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. నిజామాబాద్‌ జిల్లా నుంచి హాజరైన వినియోగదారుల రాష్ట్ర ప్రతినిధులు సందు ప్రవీణ్(Sandu Praveen), పెందోట అనిల్‌కుమార్‌(Pendota Anil Kumar) ఈ మేరకు రెండురోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు. దీంతో బీఐఎస్‌(BIS) అధికారులు సూర్య కల్యాణి, శిఖా రాణా, భారత వినియోగదారుల సమాఖ్య ఛైర్మన్​ అనంతశర్మ చేతులమీదుగా ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌(Training Certificate) అందుకున్నారు. త్వరలో నిజామాబాద్‌లో భారత వినియోగదారుల సమాఖ్య ఆధ్వర్యంలో ఆహర కల్తీపై శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు సందు ప్రవీణ్‌ తెలిపారు.