అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Prajavani | నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కార్యక్రమానికి 27 ఫిర్యాదులు వచ్చాయి.
ఫిర్యాదుదారుల (complainants) సమస్యలను విని.. వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని (police services) వినియోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.
