KPHB | కేపీహెచ్​బీలో కమర్షియల్​ ఓపెన్​ ల్యాండ్​ గజం ధర రూ. 1.36 లక్షల పైనే..
KPHB | కేపీహెచ్​బీలో కమర్షియల్​ ఓపెన్​ ల్యాండ్​ గజం ధర రూ. 1.36 లక్షల పైనే..

అక్షరటుడే, హైదరాబాద్: KPHB : కూకట్​పల్లి హౌజింగ్ బోర్డు కాలనీ(Kukatpally Housing Board Colony)లోని ఓపెన్ ఫ్లాట్లకు మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. పూర్తి పారదర్శక విధానంలో ఈ-యాక్షన్ ప్రక్రియ ద్వారా ఆన్​లైన్​లో బుధవారం హౌజింగ్ బోర్డు భూములను విక్రయించారు. కేపీహెచ్​బీ ఫేజ్ 4 లోని ఫ్లాట్ నెం 1 కు చెందిన ఒక ఎకరం విస్తీర్ణంలోని కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ రూ.65.34 కోట్లు పలికింది.

ఈ స్థలానికి సంబంధించిన వేలం పాటకు మొత్తం 11 బిడ్లు దాఖలయ్యాయి. కాగా, నలుగురు బిడ్డర్లు వేలం పాటలో పాల్గొన్నారని హౌజింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతం (Housing Board Vice Chairman VP Gautam) తెలిపారు. ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్ అక్కౌంటెన్సీ ఆఫ్ ఇండియా (Institute of Chartered Accountancy of India) సంస్థ వారు ఈ ఎకరా విస్తీర్ణం భూమిని రూ.65.34 కోట్లకు వేలం పాటలో కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు.

KPHB : రాజీవ్ స్వగృహ ప్లాట్ల (Rajiv Swagruha plots) ద్వారా 26 కోట్లు

బండ్లగూడ నాగోల్(Bandlaguda Nagole)​లోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను దరఖాస్తుదారులకు లాటరీ ద్వారా కేటాయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.26 కోట్ల మేర ఆదాయం సమకూరింది. మధ్యతరగతి వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా అందుబాటులోని ధరలతో ఈ ప్లాట్లను తక్కువ ధరలతో విక్రయించారు. ఇక్కడి 159 ఫ్లాట్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. కాగా 131 ఫ్లాట్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించారు. తద్వారా రూ.26 కోట్ల మేర ఆదాయం వచ్చింది.