అక్షరటుడే, వెబ్డెస్క్ : Fee reimbursement | రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీ (Private Colleges)లకు కొంతకాలంగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదు. దీంతో బకాయిలు పేరుకుపోయాయి.
రాష్ట్రవ్యాప్తంగా స్కాలర్షిప్ (Scholarship), రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలో వృత్తి విద్యా కాలేజీల యాజమాన్యాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. బకాయిలు చెల్లించకోపోతే ఈ నెల 15 నుంచి కాలేజీలను బంద్ చేస్తామని ప్రకటించాయి.
Fee reimbursement | రూ.10 వేల కోట్ల బకాయిలు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రావాల్సి ఉందని కాలేజీలు తెలిపాయి. వాటిని చెల్లించపోతే నిరవదికంగా కాలేజీలను మూసి వేస్తామని హెచ్చరించాయి. ఈ నెల 15న ఇంజినీర్స్ డే (Engineers’ Day) బ్లాక్ డేగా నిర్వహిస్తామని కాలేజీల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ను కలిసి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు నోటీసులు అందించారు.
Fee reimbursement | జీతాలు చెల్లించలేని దుస్థితి
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కాలేజీల యాజమాన్యాలు తెలిపాయి. సిబ్బందికి జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నాయి. కాలేజీల నిర్వాహణ, ఉద్యోగుల జీతాభత్యాల కోసం అప్పులు చేయాల్సి పలు కాలేజీల యజమానులు వాపోయారు. మరోవైపు స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ నిధులు రాకపోవడవంతో విద్యార్థులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. రీయింబర్స్మెంట్ రాలేదని కాలేజీలు చదువు పూర్తయినా.. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. మొత్తం ఫీజు కడితనే ఇస్తామని చెబుతున్నాయి.
Fee reimbursement | ఈ నెల 15 నుంచి కాలేజీలు బంద్ చేస్తాం.. యాజమాన్యాల కీలక నిర్ణయం https://t.co/LvLol0yZIT#feereimbursment #parivatecollages #collage #education
— Akshara Today (@aksharatoday) September 12, 2025