అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Medical College | నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా డాక్టర్ ఎన్ కృష్ణమోహన్(Dr. N Krishnamohan) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల సూపరింటెండెంట్ నాగరాజు, తదితర ఉద్యోగులు గురువారం ఆయనకు స్వాగతం పలికారు.
Nizamabad Medical College | మహేశ్వరం మెడికల్ కళాశాల ప్రొఫెసర్గా..
కృష్ణమోహన్ ఇదివరకు మహేశ్వరం జిల్లా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్గా పనిచేశారు. ప్రమోషన్పై రెగ్యులర్ ప్రిన్సిపల్గా నిజామాబాద్(Nizamabad)కు బదిలీ అయ్యారు. ఇదివరకు ప్రిన్సిపల్గా కొనసాగిన డాక్టర్ ఇందిరా(Dr. Indira) ఐదు నెలల క్రితం ఇతర జిల్లా నుంచి బదిలీపై వెళ్లారు. అప్పటినుంచి సైకియాట్రిస్ట్ డాక్టర్ శివప్రసాద్(Psychiatrist Dr. Sivaprasad) ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా కొనసాగుతున్నారు. శివప్రసాద్ నుంచి ప్రిన్సిపల్గా కృష్ణ మోహన్ పూర్తి చార్జి తీసుకున్నారు.
జీజీహెచ్ సూపరిటెండెంట్ వచ్చేనా..
కాగా.. నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్గా నియమితులైన కృష్ణ మాలకొండరెడ్డి ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. ప్రభుత్వం ఆయనను సూపరింటెండెంట్గా నియమించినా ఇప్పటి వరకు బాధ్యతల స్వీకరణపై ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో ఆయన వస్తారా లేదా అనే సంశయం నెలకొంది.
కామారెడ్డి మెడికల్ కాలేజీ, జీజీహెచ్ పాలనాధికారుల బాధ్యతల స్వీకరణ
కాగా.. కామారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా డా.వాల్య, జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ వెంకటేశ్వర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారిని పలువురు ప్రొఫెసర్లు, వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు.