ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిCollector Rajiv Gandhi Hanumanthu | రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్​

    Collector Rajiv Gandhi Hanumanthu | రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Collector Rajiv Gandhi Hanumanthu | నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి, ఖానాపూర్ (Khanapur), సారంగాపూర్ (Sarangapur) ప్రాంతాల్లోని రైస్​మిల్లులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

    కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం, మిల్లింగ్​ (Milling) అయిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బియ్యాన్ని భద్రపరిచే విధానాన్ని పరిశీలించారు. ముందస్తుగానే ఋతుపవనాల (Monsoon) ప్రవేశంతో వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు.


    ఇప్పటికే 90 శాతానికి పైగా ధాన్యం సేకరణ పూర్తయిందని, చివరి దశలో మిగిలిన ధాన్యం నిల్వలను కూడా దిగుమతి చేసుకొని మిల్లింగ్ చేయాలని పేర్కొన్నారు. మిల్లింగ్ చేసిన బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపర్చాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎస్​వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...