అక్షరటుడే, ఇందూరు : Panchayat Elections | జీపీ మొదటి విడత ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి అందజేసే ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) బుధవారం సందర్శించారు. వర్ని, చందూర్, మోస్రా మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో (Distribution Centers) పంపిణీ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Panchayat Elections | గందరగోళానికి తావివ్వొద్దు..
ఎన్నికల సామగ్రిని ఎలాంటి లోటుపాట్లు గందరగోళానికి తావు లేకుండా పక్కాగా అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. చెక్లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందిందా లేదా పరిశీలించుకోవాలని సూచించారు. సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించారు.
Panchayat Elections | బందోబస్తు మధ్య..
సామాగ్రి, బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో సాయుధ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా పాలనాధికారి సూచించారు. ఇలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని ఆర్వోలకు సూచించారు. అలాగే నవీపేట మండల (Navipet Mandal) పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఎన్నికల పరిశీలకుడు శ్యాంప్రసాద్ లాల్ సందర్శించారు.