Homeతాజావార్తలుAnde Sri | అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్​రెడ్డి

Ande Sri | అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్​రెడ్డి

కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియల్లో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొన్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ande Sri | కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) అంత్యక్రియలు ఘట్​కేసర్​లో ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతున్నాయి. ఆయన అంతిమయాత్రలో మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)​, సీతక్క(Seethakka), పలువురు కాంగ్రెస్​ నాయకులు, ఇతర పార్టీల నేతలు అభిమానులు పాల్గొన్నారు.

అందెశ్రీ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. ఘట్​కేసర్​లోని ఎన్​ఎఫ్​సీ నగర్​లో ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన పాడె మోశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్​కుమార్​ సైతం పాడె మోశారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన భార్యను ఓదార్చారు.

అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. 500 మంది కళాకారులు అంత్యక్రియల్లో ఆటపాటలతో అందెశ్రీకి నివాళులు అర్పించారు.

Must Read
Related News