Homeజిల్లాలునిజామాబాద్​CM Revanth Reddy | ఇందూరు వాసులకు అలెర్ట్​.. సీఎం రేవంత్​రెడ్డి పర్యటన దృష్ట్యా రేపు...

CM Revanth Reddy | ఇందూరు వాసులకు అలెర్ట్​.. సీఎం రేవంత్​రెడ్డి పర్యటన దృష్ట్యా రేపు ట్రాఫిక్​ ఆంక్షలు..!

CM Revanth Reddy | సీఎం రేవంత్​రెడ్డి శుక్రవారం (అక్టోబరు 10) నిజామాబాద్​కు వస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాతృమూర్తి ద్వాదశ దినకర్మను శుక్రవారం నిర్వహిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: CM Revanth Reddy | సీఎం Chief Minister రేవంత్​రెడ్డి శుక్రవారం (అక్టోబరు 10) నిజామాబాద్​కు రానున్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాతృమూర్తి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.

ఆమె ద్వాదశ దినకర్మను శుక్రవారం నిర్వహిస్తున్నారు. బోర్గాం(పీ)లోని భూమారెడ్డి కన్వెన్షన్​ హాల్​లో మధ్యాహ్నం ఈ కార్యక్రమం ఉంటుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం నిజామాబాద్​ జిల్లా కేంద్రానికి Nizamabad district headquarters వస్తున్నారు. కాగా, ఇది ప్రైవేటు కార్యక్రమం అయినా.. వచ్చేది ముఖ్యమంత్రి కావడంతో నిజామాబాద్​ నగరం (Nizamabad city) లో ట్రాఫిక్​ ఆంక్షలు traffic restrictions విధిస్తున్నారు.

CM Revanth Reddy | ఎప్పటి నుంచి అంటే..

రేపు ఉదయం 11 గంటల నుంచి నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్​ విభాగం అసిస్టెంట్​ కమిషనర్​ ఆఫ్​ పోలీస్​ ప్రకటించారు.

మాధవనగర్​ బైపాస్​, కంఠేశ్వర్​ బైపాస్​, అర్సపల్లి, రాజరాజేంద్ర చౌరస్తా, పులాంగ్ చౌరస్తా, రుక్మిణి ఛాంబర్, బోర్గాం(పీ) వంతెన, హోటల్​ నిఖిల్​ సాయి ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు ఉంటాయని వివరించారు.

నగర ప్రజలు, జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.