HomeతెలంగాణCM Revanth Reddy | కడుపు మంటతో కేసీఆర్​కు దు:ఖం వస్తోంది.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన...

CM Revanth Reddy | కడుపు మంటతో కేసీఆర్​కు దు:ఖం వస్తోంది.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Govt) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి కడుపు మంటతో కేసీఆర్​కు ​(KCR) దు:ఖం వస్తోందని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ (Kollapur)​ నియోజకవర్గం జటప్రోల్​లో యంగ్​ ఇండియా రెసిడెన్షియల్​ పాఠశాలకు (Young India School) ఆయన శంకుస్థాపన చేశారు. కొల్లాపూర్​ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.

CM Revanth Reddy | పాలమూరుకు సున్నం పెట్టారు..

అన్నం పెట్టిన పాలమూరు జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్​ సున్నం పెట్టారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. 2009లో కేసీఆర్​ కరీంనగర్ (Karimnagar)​ నుంచి పాలమూరు వలస వచ్చి ఎంపీగా పోటీ చేశారన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్​ను గెలిపించి ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచారన్నారు. కానీ పాలామూరు జిల్లా అంటే కేసీఆర్​ కుటుంబానికి చిన్న చూపు అన్నారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్​ పాలమూరుకు ఏం చేశారని ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్ట్​లో నిర్వాసితులకు జీవో 98 ప్రకారం పరిహారం ఇవ్వలేదన్నారు. వాల్మీకి, బోయలను గతంలో ఎస్టీల్లో చేరుస్తానని కేసీఆర్​ హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు.

CM Revanth Reddy | ఎందుకు దు:ఖం వస్తోంది..

ప్రజాపాలన చూస్తే కేసీఆర్‌కు ఎందుకు దుఃఖం వస్తుందని సీఎం ప్రశ్నించారు. పాలమూరు బిడ్డ తెలంగాణకు సీఎం అయినందుకు దు:ఖం వస్తుందా అన్నారు. అన్ని వర్గాల పిల్లలు చదువుకోవడానికి యంగ్​ ఇండియా స్కూళ్లు పెట్టినందుకా.. ఎస్సీ వర్గీకరణ (SC Classification) చేసినందుకు దుఃఖం వచ్చిందా అని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్‌ ఏం చేశారని ప్రశ్నించారు.

CM Revanth Reddy | ప్రాజెక్ట్​లకు అడ్డుపడొద్దు

పాలమూరు ప్రాజెక్టులకు అడ్డుపడొద్దని సీఎం రేవంత్​రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్టు రద్దు చేసి సాయం చేయాలన్నారు. లేదంటే పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని అన్ని ప్రాజెక్ట్​లను పూర్తి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 2034 వరకు పాలమూరు బిడ్డే సీఎంగా ఉంటారని పేర్కొన్నారు.