అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలతో ఆదివారం భేటీ అయ్యారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. బీఆర్ఎస్ నేతల పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. అనర్హత విషయంలో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ధర్మాసనం సూచించింది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. ఈ క్రమంలో వారితో సీఎం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
CM Revanth Reddy | హాజరైన 9 మంది ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), పోచారం శ్రీనివాస్రెడ్డి (బాన్సువాడ), బండ్ల కృష్ణమోహన్రెడ్డి(గద్వాల), కాలే యాదయ్య (చేవేళ్ల), సంజయ్ కుమార్ (జగిత్యాల), ప్రకాశ్గౌడ్ (రాజేంద్రనగర్), అరికపూడి గాంధీ (శేరిలింగంపల్లి), మహిపాల్రెడ్డి (పటాన్చెరు) కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. వీరిలో కడియం శ్రీహరి మినహా మిగతా 9 మంది సీఎం రేవంత్రెడ్డి నివాసంలో భేటీకి హాజరు అయ్యారు.
CM Revanth Reddy | అభివృద్ధి కోసమే..
బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలకు అనర్హత భయం పట్టుకుంది. స్పీకర్ నోటీసులు (Speaker Notices) ఇవ్వడంతో ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. సాంకేతిక అంశాల ఆధారంగా అనర్హత నుంచి తప్పించుకోవాలని వారు భావిస్తున్నారు. ఈ మేరకు తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని నోటీసులకు వివరణ ఇస్తున్నారు. కేవలం అభివృద్ధి కోసమే సీఎం రేవంత్రెడ్డిని కలిశామని చెబుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే (Gadwal MLA) కృష్ణమోహన్రెడ్డి తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని స్పీకర్కు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కావడం గమనార్హం.
CM Revanth Reddy | ధైర్యం నింపడానికేనా..
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారిలో ధైర్యం నింపడానికి సీఎం సమవేశం నిర్వహించినట్లు సమాచారం. స్పీకర్ నోటీసులపై ఎలా స్పందించాలనే విషయం వారితో చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో సీఎం రేవంత్రెడ్డి ఉప ఎన్నికలు రావని పలుమార్లు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అనర్హత పడదని ఆయన ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.