HomeతెలంగాణCM Revanth | కేసీ వేణుగోపాల్​తో సీఎం రేవంత్​రెడ్డి భేటీ

CM Revanth | కేసీ వేణుగోపాల్​తో సీఎం రేవంత్​రెడ్డి భేటీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal)​తో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) అనంతరం రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. సుమారు గంటపాటు వీరు ఇద్దరు సమావేశం అయ్యారు. ముగ్గురు కొత్త మంత్రులుగా ప్రమాణం చేయడంతో వారికి ఏ శాఖలు కేయించాలనే అంశంపై చర్చించారు.

మంత్రి పదవులు దక్కని వారు ప్రస్తుతం అలకబూనారు. ఈ క్రమంలో మరో మూడు మంత్రి పదవుల భర్తీపై సైతం వారు చర్చించినట్లు సమాచారం. అలాగే పీసీసీ కార్యవర్గం కూర్పు, కార్పొరేషన్‌ ఛైర్మన్​ పదవుల భర్తీ గురించి సీఎం కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లారు.