HomeతెలంగాణCM Revanth | కాళేశ్వరంలో పుణ్యస్నానం ఆచరించిన సీఎం రేవంత్​

CM Revanth | కాళేశ్వరంలో పుణ్యస్నానం ఆచరించిన సీఎం రేవంత్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Revanth | సరస్వతి నది (Saraswati River) పుష్కరాలు నేడు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొగుట పీఠాధిపతి మాధవనంద సరస్వతి స్వామిజీ తెల్లవారు జామును పుష్కరాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భక్తులు తరలివచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు. కాగా.. సీఎం రేవంత్​రెడ్డి (CM revanth reddy) గురువారం సాయంత్రం కాళేశ్వరం (kaleshwaram) వద్ద త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఆయన వెంట మంత్రులు శ్రీధర్​బాబు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, పొన్నం ప్రభాకర్​, కొండా సురేఖ తదితరులు ఉన్నారు. అంతకుముందు సీఎం రేవంత్​ రెడ్డి కాళేశ్వరంలో గదుల సముదాయాన్ని ప్రారంభించారు. అలాగే సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు (statue of goddess saraswati unveiled). కాగా.. సరస్వతి పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి.