Homeజిల్లాలుకామారెడ్డిCM Revanth Reddy | కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్​ రెడ్డి ఏరియల్​ సర్వే

CM Revanth Reddy | కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్​ రెడ్డి ఏరియల్​ సర్వే

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : CM Revanth Reddy | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy Rains) కామారెడ్డి, మెదక్​ జిల్లాలు (Kamareddy and medak Districts) అతలాకుతలం అయ్యాయి. జిల్లాలోని కామారెడ్డి, జుక్కల్​, ఎల్లారెడ్డిలలో వర్షం బీభత్సం సృష్టించింది.

రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలను సీఎం రేవంత్​రెడ్డి (CM Reavanth Reddy) హైదరాబాద్​ నుంచి మానిటరింగ్​ చేశారు. వర్షధాటికి చాలా చోట్ల చెరువులు తెగిపోయాయి. అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లాయి. దీంతో అధికార యంత్రాంగం స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. పలుచోట్ల వరదల్లో చిక్కుకున్న బాధితులను ఎన్డీఆర్​ఎఫ్​, ఎస్డీఆర్​ఎఫ్​ బృందాలు రక్షించాయి.

CM Revanth Reddy | సీఎం ఏరియల్​ సర్వే..

రాష్ట్రంలో మెదక్​, కామారెడ్డి జిల్లాలో వరద కారణంగా అపారమైన నష్టం వాటిల్లింది. దీంతో సీఎం ప్రత్యక్షంగా ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు ఏరియల్​ సర్వే (aerial survey) నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్​ (Hyderabad) నుంచి ప్రత్యేక హెలీకాప్టర్​లో బయలుదేరారు. మెదక్​తో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్​లో ముంపు ప్రాంతాలను హెలీకాప్టర్​ నుంచే వీక్షించారు. అలాగే పోచారం, నిజాంసాగర్​ ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం మెదక్​కు వెళ్లారు. అక్కడి ​లోని కలెక్టరేట్​లో భారీవర్షాలపై సమీక్ష చేయనున్నారు.

Must Read
Related News