ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | తెలంగాణ‌పై ప్ర‌ధానికి వివక్ష‌.. యూరియా ఇవ్వ‌డం లేద‌ని సీఎం రేవంత్...

    CM Revanth Reddy | తెలంగాణ‌పై ప్ర‌ధానికి వివక్ష‌.. యూరియా ఇవ్వ‌డం లేద‌ని సీఎం రేవంత్ ఫైర్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Narendra Modi) తెలంగాణ రాష్ట్రంపై మొద‌టి నుంచి వివ‌క్ష చూపుతున్నార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆరోపించారు. యూరియా స‌ర‌ఫ‌రా చేయ‌కుండా ప్ర‌ధాని అడ్డుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

    తెలంగాణకు కేంద్రం యూరియా సరఫరా(Urea Supply) చేయకుండా ప్రధాని అడ్డుకుంటున్నారని, మోదీకి మొదటి నుంచి తెలంగాణపై వివక్ష ఉందన్నారు. రాష్ట్ర రైతాంగానికి అవసరం మేరకు యూరియా సరఫరా చేయకుండా వివక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తోన్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని పార్లమెంట్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు ఎండగట్టారని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపి పార్లమెంట్‌లో తెలంగాణ రైతుల పక్షాన నిలిచిన కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ(Congress Leader Priyanka Gandhi)కి రేవంత్‌రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

    CM Revanth Reddy | బీఆర్ ఎస్ ఎంపీలకు భ‌య‌మా?

    రాష్ట్ర రైతాంగ అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని రాష్ట్రానికి చెందిన బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు కేంద్రాన్ని నిల‌దీయ‌డం లేద‌ని రేవంత్‌రెడ్డి ప్ర‌శ్నించారు. రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) మోదీ భజనలో బిజీగా ఉన్నారని విమర్శించారు. “రాష్ట్ర రైతాంగానికి అవసరం మేరకు యూరియా సరఫరా చేయకుండా నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోన్న మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని, మోసపూరిత వైఖరిని ఎండగడుతూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపి పార్లమెంట్ వేదికగా తెలంగాణ రైతుల పక్షాన నిలిచిన ప్రియాంక గాంధీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

    రాష్ట్ర రైతాంగ అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని మేం లేఖల రూపంలో, విజ్ఞప్తుల రూపంలో పదే పదే కోరినా కేంద్రం స్పందించకపోవడం దారుణం. రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మోదీ భజనలో బిజీగా ఉన్నారు. మన రైతుల కోసం మోదీ సర్కారు(Modi Government) పై ఒత్తిడి తెచ్చేందుకు మాతో కలిసి రావాల్సిన బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో పత్తా లేరు. గల్లీలో లొల్లి చేయడానికి ఉత్సాహం చూపే వాళ్లు ఢిల్లీలో మోదీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారు!? మోదీ అంటే భయమా! భక్తా!?” అని రేవంత్‌రెడ్డి త‌న పోస్టులో ప్ర‌శ్నించారు.

    Latest articles

    Telangana University | తెయూ అధ్యాపకురాలు గోల్డి బల్బీర్​కౌర్​కు డాక్టరేట్​

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో ఆంగ్ల విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న గోల్డి బల్బీర్​ కౌర్...

    Team india | శ్రేయాస్ అయ్య‌ర్‌కి నో ఛాన్స్.. ఆసియా క‌ప్‌లో ఆడే భార‌త జ‌ట్టు ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Team india | సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025...

    ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్​, సర్వేయర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాకు పనుల నిమిత్తం వచ్చే వారిని...

    Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. శ్రీవాణి దర్శన కోటా టికెట్ల పెంపు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శనం చేసుకుంటారు. భక్తుల...

    More like this

    Telangana University | తెయూ అధ్యాపకురాలు గోల్డి బల్బీర్​కౌర్​కు డాక్టరేట్​

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో ఆంగ్ల విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న గోల్డి బల్బీర్​ కౌర్...

    Team india | శ్రేయాస్ అయ్య‌ర్‌కి నో ఛాన్స్.. ఆసియా క‌ప్‌లో ఆడే భార‌త జ‌ట్టు ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Team india | సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025...

    ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్​, సర్వేయర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాకు పనుల నిమిత్తం వచ్చే వారిని...