అక్షరటుడే, హైదరాబాద్: clouds : తెలంగాణపై భూమధ్యరేఖ శీతోష్ణస్థితి కొనసాగుతోంది. మధ్యాహ్నం గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఆరెంజ్, రెడ్ జోన్ స్థాయిలో నమోదు అవుతున్నాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారుతోంది. ఆకాశాన్ని క్యూములోనింబస్ మేఘాలు కమ్మేస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. అంతెత్తున ఓ మేఘంపై భానుడి కిరణాలు పడటంతో.. ఆ మేఘం పసిడి వర్ణంలో ప్రతిబింబిస్తూ మహా నగర వాసులను కనువిందు చేసింది. ఉన్నతశ్రేణి హిమాలయాల్లోని వైకుంఠ క్షేత్రంగా భావించే కైలాస పర్వతంలా దర్శనం ఇచ్చింది. ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని తిలకించిన మహానగర వాసులు కాసేపు మైమరచిపోయారు. నిత్యం యాంత్రికంగా మారిన జీవితం నుంచి కాస్త ఉపశమనం పొందారు.