అక్షరటుడే, బాల్కొండ: Sriram Sagar | తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar Project) వరద తగ్గుముఖం పట్టడంతో వరద గేట్లను ముసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 29,545 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. బుధవారం రాత్రి 8 వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలిన అధికారులు గురువారం ఉదయం వరద గేట్లను ముసివేశారు.
Sriram Sagar | కాల్వల ద్వారా నీటి విడుదల
ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో కాకతీయ కాలువ (Kakatiya Canal) ద్వారా 5,500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 19,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్యులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్యులు విడుదల చేస్తున్నారు. అలీసాగర్ ఎత్తిపోతలకు 360 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతలకు 270 క్యూసెక్యులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. 684 క్యూసెక్కుల నీరు ఆవిరిగా పోతోంది. మొత్తం 29,545 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.501 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1091 అడుగుల (80.501టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. వరద నీటి ప్రవాహం ఉధృతి ఉన్నందున గోదావరి పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ ఏఈఈ కొత్త రవి (AE Kotha Ravi) తెలిపారు.